అమెరికాలో రక్తపుమడుగులో భారత దంపతుల జంట


0

అమెరికాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. న్యూజెర్సీలో భారత దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దంపతులు రక్తపు మడుగులో పడి ఉండగా, వారి నాలుగేళ్ల చిన్నారి బాల్కనీలో వెక్కివెక్కి ఏడుస్తూ కనిపించింది. అది గమనించిన పొరుగువారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లగా ఈ దారుణం వెలుగుచూసింది.

మహారాష్ట్రలోని బీద్‍ జిల్లాకు చెందిన బాలాజీ రుద్రవర్‍కు (32) ఆర్తితో 2014లో వివాహమైంది. అనంతరం 2015 ఆగస్టులో ఉద్యోగరీత్యా కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. యూఎస్‍లోని ఓ ప్రముఖ భారత ఐటీ సంస్థలో బాలాజీ ఐటీ నిపుణుడిగా ఉద్యోగం చేస్తుండగా భార్య గృహిణి. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉండగా.. బాలాజీ భార్య ఆర్తి(30) ప్రస్తుతం 7 నెలల గర్భిణి. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం(ఏప్రిల్ 7,2021) బాలాజీ కూతురు న్యూజెర్సీలోని నార్త్‌ ఆర్లింగ్టన్‌లో గల తన ఇంటి బాల్కనీలో ఏడుస్తూ కన్పించింది. చిన్నారిని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి తలుపు తీసేందుకు ప్రయత్నించగా లోపలి నుంచి గడియపెట్టి ఉంది. దీంతో డోర్‍ బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా బాలాజీ, ఆయన భార్య లివింగ్‍ రూంలో రక్తపుమడుగులో కన్పించారు. ఇద్దరి శరీరాలపై బలమైన కత్తిపోట్లు ఉన్నాయి. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

బాలాజీ తన భార్యను పొడిచి ఆపై తాను ఆత్మహత్య చేసుకుని ఉంటారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే పోస్టుమార్టం నివేదిక వస్తేగానే మృతికి గల కారణాలు చెప్పలేమని పోలీసులు తెలిపారు. దంపతుల మృతిపై మహారాష్ట్రలో ఉంటున్న బాలాజీ కుటుంబానికి సమాచారమిచ్చారు. ప్రస్తుతం ఆ చిన్నారి మృతుడి స్నేహితుడి సంరక్షణలో ఉంది.

[zombify_post]


Comments

comments