పుష్కరఘాట్ లో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి


నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పోచంపాడు పుష్కరఘాట్ లో పడి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.  వీరంతా మాక్లూర్‌ మండల వాసులుగా పోలీసులు గుర్తించారు.

గోదావరిలో స్నానం చేస్తుండగా ఆరుగురు గల్లంతు అయ్యారు. నీటిలో మునిగి వారంతా మృతిచెందారు.  మృతులు సురేశ్ (40), యోగేశ్ (16), శ్రీనివాస్ (40), సిద్ధార్థ్ 16, శ్రీకర్ (14), రాజు (24). మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు.  ఆరుగురు మృతదేహాలను పోలీసులు వెలికితీశారు.

ఒకే కుటుంబానికి చెందినా ఆరుగురు మృతి చెందటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Comments

comments