సుప్రీంకోర్టు 48వ చీఫ్‌ జస్టిస్‌గా ఎన్వీ రమణ ప్రమాణం


0

సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జస్టిస్‌ ఎన్వీ రమణ చేత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణం చేయించారు. 2022 ఆగస్టు 26 వరకు ఎన్వీ రమణ పదవిలో కొనసాగనున్నారు.

ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో,  ప్రధాని మోడీ, పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్రమంత్రులు, న్యాయశాఖ ఉన్నతాధికారులతో పాటు జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. కోవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

[zombify_post]


Comments

comments