మసాజ్ సెంటరులో వ్యభిచారం 10 మంది యువతుల అరెస్టు


0

హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ సెంటరులో బ్యూటీ సెలూన్, స్పా సెంటరు పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో మొత్తం 23 మంది అరెస్టు చేశారు. వీరిలో 10 మంది విటులు, 10 మంది అమ్మాయిలు ఉన్నారు. ముగ్గురు నిర్వాహకులను కూడా అరెస్టు చేశారు.

హైదరాబాద్లోని మాదాపూర్ కావూరి హిల్స్ కాలనీ ఎన్ స్కేర్ బిల్డింగ్ లో హెవెన్ స్పా అండ్ ఫ్యామిలీ సెలూన్ ను నిర్వహిస్తున్నారు.  బయట మసాజ్ సెంటర్ బోర్డు పెట్టి లోపల అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆదివారం మాదాపూర్ ఎస్ ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పది మంది యువతులను ఏడుగురు విటులను ప్రధాన నిర్వాహకుడు అరిగెల చిట్టిబాబు తో పాటు అతడి అనుచరులు నలుగురిని అదుపులోకి తీసుకొని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. సంఘటనా స్థలం నుంచి రూ.73 వేల నగదు 28 సెల్ఫోన్లు ఓ ల్యాప్టాప్ ఓ కారును స్వాధీనం చేసుకున్నారు.

మరో ఘటనలో గచ్చిబౌలి ఐటీ కారిడార్లోని ఓ స్టార్ హోటల్ లో సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నానక్ రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ప్రాంతంలో ఫేర్ ఫీల్డ్ బై మారియట్ పేరిట స్టార్ హోటల్ ఉంది. ఇందులో వ్యభిచారం సాగుతున్నట్లు సమాచారం అందుకున్న సైబరాబాద్ యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ బృందం శనివారం రాత్రి హోటల్లో దాడులు చేసి ముగ్గురు విదేశీ యువతులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ఒకరు ఉజ్బెకిస్థాన్ దేశానికి చెందిన వారు కాగా మరో ఇద్దరిని థాయ్లాండ్ యువతులుగా పోలీసులు గుర్తించారు. ఒడిశాకు చెందిన నిర్వాహకుడు మణికేష్ యాదవ్ను అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు.

[zombify_post]


Comments

comments