అయ్యప్ప మాలధారణలో ఉన్న ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కాళ్ళకు చెప్పులు ధరించి నడవడం పై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అలా చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే ఈ వ్యవహారం పై మంత్రి స్పందించారు. ఆరోగ్య సమస్యల కారణంగానే చెప్పులు వేసుకున్నట్లు స్పష్టం చేశారు.
హిందూ మతాన్ని తన కంటే ఎక్కువగా ఎవరూ గౌరవించరన్న ఆయన.. ఆరోగ్య సమస్యలతోనే చెప్పులు వేసుకున్నట్లు స్పష్టం చేశారు. డయాబెటిస్ ఉంది కాబట్టే చెప్పులు వేసుకుంటున్నానని క్లారిటీ ఇచ్చారు అవంతి. ఇక, స్వామిమాలలో చెప్పులు వేసుకోవడం తప్పుకాదన్న ఆయన.. తాను టీడీపీ ఎంపీగా ఉన్న సమయంలోనూ మాల ధరించానని.. అప్పుడు కూడా చెప్పులు వేసుకున్నట్టు తెలిపారు. అయ్యప్ప మాలాలో ఉన్నప్పుడు మాజీ ఎంపీ మురళీమోహన్ కూడా చెప్పులు వేసుకున్నారని గుర్తు చేశారు మంత్రి అవంతి శ్రీనివాస్.
అయితే ఈ సమస్యను రాజకీయం చేయడానికి తనపై చంద్రబాబు మతపరమైన విమర్శలు చేయిస్తున్నారన్నారు.